TRINETHRAM NEWS

Trinethram News : Apr 02, 2024,

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో రూ. 37. 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖాదికారులకు నగదు అప్పజెప్పినట్లు జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.