TRINETHRAM NEWS

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

బుధవారం స్వామివారిని 65,514 మంది భక్తులు దర్శించుకున్నారు.

20,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.