మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఇప్పటికే 4 అమలు చేశామని మరియు త్వరలోనే ఇంకా మిగిలిన గ్యారంటీలు అమలు చేసే దిశలో ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని అన్నారు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి అభ్యర్థిని అత్యధిక మెజారిటీగాతో గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ చేరే విధంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలనీ దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖామాత్యులు మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ వ్యవసాయశాఖమాత్యులు మరియు మల్కాజ్గిరి పార్లమెంటరీ ఎన్నికల ఇంచార్జి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ బీసీ వెల్ఫేర్శాఖామాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్, వేంనరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, వజ్రేష్ యాదవ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతిరెడ్డి, పున్నారెడ్డి, జ్యోత్స్నా శివారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
MLA KP. Vivekanand : ధయ, ధర్మమార్గాన్ని ఎలా గడపాలో ప్రజలకు బోధించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS Prophet Muhammad, the great saint who taught people how to live the path of compassion and righteousness: MLA KP. Vivekanand Trinethram News : Medchal : ఈరోజు 128 –…
Kuna Srisailam Goud : మిలాద్ ఉన్ నబి’ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్
TRINETHRAM NEWS Former MLA and Congress leader Kuna Srisailam Goud participated in Milad Un Nabi celebrations Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఈరోజు చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్ ‘మజీద్…