TRINETHRAM NEWS

రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ వెళుతున్న ప్రధాని మోదీ

లాహోస్ అధ్యక్షతన 21వ ఆసియాన్ – ఇండియన్ సమ్మిట్

సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోదీ పర్యటించనున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా మోదీ 21వ ఆసియాన్ – ఇండియన్ సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆసియాన్ – ఇండియాకు లాహోస్ అధ్యక్షత వహిస్తోంది.

ఈ సమావేశాల్లో వివిధ దేశాలతో భారత్ భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లో కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో – పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది అని విదేశాంగ శాఖ పేర్కొంది.

కాగా, ప్రధాని మోదీ …రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలను సందర్శించి .. యుద్ధం ముగింపు విషయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం మోదీ ఇటలీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత స్థాయిలో ఆయన చర్చలు జరిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App