TRINETHRAM NEWS

Prajavani applications should be dealt with promptly

*సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్లు

పెద్దపల్లి, సెప్టెంబర్-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు జే.అరుణ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.

సోమవారం అదనపు కలెక్టర్లు జే.అరుణ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు

అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prajavani applications should be dealt with promptly