TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య

అయోధ్య లో రామ మందిర నిర్మాణం పూర్తి దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేశారు.

ఈ రామ మందిర ప్రారంభోత్సవ వేడుక 2024 జనవరి 22న 12 గంటల 20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.ఈ రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తుంది.

శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం కు ప్రత్యేక అతిథి గా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని, ఆయనతోపాటు ఈ కార్యక్రమానికి దేశం మొత్తం మీద ఎనిమిది వేల మంది ప్రముఖులకు ఆహ్వానించడం జరుగుతుంది.