TRINETHRAM NEWS

Palm oil industry foundation stone in Peddarathupalli village

కొలనూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి మరియు రోడ్డు ప్రారంభం..

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి నియోజకవర్గంలో ఈనెల 19వ తేదీన 5గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి, శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో పామాయిల్ పారిశ్రామిక సముదాయం శంఖుస్థాపన మరియు ఓదెల మండలం కొలనూర్ లో ప్రభుత్వ ఆసుపత్రి, రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. మంత్రుల పర్యటనను ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Palm oil industry foundation stone in Peddarathupalli village