TRINETHRAM NEWS

Trinethram News : హన్మకొండ జిల్లా : ఫిబ్రవరి 04
యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ. విశ్వకర్మ సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల-2024 సందర్భంగా,మంచిర్యాల జిల్లా రామ్ నగర్ కు చెందిన బ్రహ్మశ్రీ.డా. నూతి. అభి లాష్ వెలుగు నంది పురస్కారాన్ని ఈరోజు అందుకున్నారు.

సాహితీ మరియూ విద్యా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు గాను తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం అందుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు.నూతి అభిలాష్..

ఈరోజు ఆదివారం రోజున
టీఎన్జీవో భవన్ హనుమకొండ లో జరిగిన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ డాక్టర్.మారేపల్లి సుధీర్ కుమార్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని నూతి అభిలాష్ అందుకున్నారు…