TRINETHRAM NEWS

విద్యుత్ షాక్ తో తల్లి ,కొడుకు మృతి

Trinethram News : కడప జిల్లా : డి కోడూరు మండలంలోని గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి (48) గురమ్మ ( 60) విద్యుత్ షాక్ తో మృతి, గుంతపల్లి గ్రామ సమీపాన ఉన్న తెలుగు గంగకాలువలో మోటర్ పెట్టి పొలానికి నిరంధిస్తున్నారు.

మోటరు ఆడకపోవటంతో చిన్నపాటి మరమ్మత్తులు చేస్తున్న సమయంలో జయరాం రెడ్డికి విద్యుత్ షాక్ తో గిలగిలా కొట్టుకుంటుండగా తల్లి గురమ్మ గమనించి కొడుకులు పట్టుకోవటంతో ఆమె కూడా విద్యుత్ షాకు గురై చనిపోయింది.

వీరి ఇరువురు చనిపోవడంతో గుంతపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బి కోడూరుపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mother and son died