TRINETHRAM NEWS

నేను ప్రజలకు సేవ చేయలేనప్పుడు నేనేందుకు ఎమ్మెల్యెగా ఉండాలనుకున్నాను..

శాసనసభ్యునిగా ఉండి ఏం చేయలేని పరిస్దితిలో ఉన్నాం.

ఇక్కడ కొందరు దేవినేని ఉమాతో పరోక్ష సంబంధాలు నడిపారు.

సర్నాల తిరుపతిరావు వార్డ్ మెంబర్ గా ఓడిపోతే జడ్పిటీసీగా గెలిపించింది నేను

మొన్న తిరుపతిరావు నాకు ఫోన్ చేసి మీ ఆశీస్సులు కావాలని అడిగాడు.

నేను పెంచిన మొక్కే నువ్వు తిరుపతిరావు .. నువ్వు బాగుండాలి అన్నాను

తిరుపతిరావును ఆటలో అరిటిపండులా మార్చితే ఇబ్బంది.

కక్షసాధింపు చర్యలు వద్దు, వైఎస్ లా పాలించండి.

లోకేష్ , చంద్రబాబుని తిట్టవు నిన్నెలా నమ్మాలని జగన్ నాతో అన్నారు.

తిట్టనివాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని చెప్పారు.

హుందా రాజకీయం మాత్రమే నేను చేస్తాను..

మనసుగాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేం.

పెద్దిరెడ్డి కాల్ చేసి తొందరపడ్డదన్నారు.

రాజకీయాలకి స్వస్తిపలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నా..

కాని శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమన్నారు..

మైలవరంలో ఇంటింటికెళ్లి చెప్పండి మనం నమ్మిన కృష్ణప్రసాద్ మనకి అండగా నియోజకవర్గంలోనే ఉంటాడని చెప్పండి..

జొహార్ వైఎస్సార్, జోహార్ ఎన్డీఆర్ అంటూ ప్రసంగం ముగించిన వసంత