TRINETHRAM NEWS

శ్రీశ్రీశ్రీ వారాహి దేవి దివ్య సుందర విగ్రహం ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

Trinethram News : కొంతమూరు గ్రామం కోరుకొండ రోడ్డులో షణ్ముఖ పీఠం, స్కంద స్వామి పర్యవేక్షణలో, వారాహిదేవి పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు శ్రీమతి విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా, వారాహి దేవి దివ్య సుందర విగ్రహం ప్రాణ ప్రతిష్ట అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు,బత్తుల బలరామకృష్ణ, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఆకాంక్షించారు.. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారిని సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు..

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Battula