TRINETHRAM NEWS

Trinethram News : చర్ల: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మూడు బేస్‌ క్యాంపులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది..

మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డారు. చింతవాగులోని సీఆర్పీఎఫ్‌ 151 బెటాలియన్‌, పామేడులోని 204 కోబ్రా బెటాలియన్‌, ధర్మారంలోని 151 బెటాలియన్‌ క్యాంపులపై గ్రనేడ్లు, రాకెట్‌లాంచర్లతో దాడి చేశారు.

ఈ దాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీనిపై సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆరా తీస్తున్నారు..