TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లాలో జోరుగా మట్టి దందా, పట్టించుకోని సంబంధించిన అధికారులు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలోని పలు చెరువుల్లో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతున్నదని, మట్టి మాఫియా మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని చెరువులపై పడిందని, రాజకీయ అండదండలతో చెరువులను దక్కించుకున్న ఇటుక బట్టీల యజమానులు అనుమతులకు మించి మట్టి తీసి చెరువులను కొల్లగొడుతున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటి ఆద్యక్షులు మద్దెల దినేష్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ ఎక్కడికక్కడే సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని ముడుపులు ఆశపెట్టి దందాను యథేచ్ఛగా సాగిస్తున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఎలాంటి వే బిల్లులు లేకుండా చెరువుల నుంచి నేరుగా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతూ మట్టిని తరలించుకుపోతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారిని మచ్చిక చేసుకుంటూ ఇటుక బట్టీల యజమానులు తమ వ్యాపారాన్ని, మట్టి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపించుకుంటున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపేణా చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా పెద్దఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.
జిల్లాలో 160కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయని
జిల్లాలోకేంద్రంలోని పెద్దపల్లి, రాఘవాపూర్‌, రంగంపల్లి, రామగిరి, కమాన్‌పూర్‌, రామగుండం, ధర్మారం, సుల్తానాబాద్‌, కాట్నపల్లి, తదితర ప్రాంతాల్లో 160కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయన్నారు. ఈ బట్టీల ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నదని, ఇక్కడి నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, మంచిర్యాల, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఇటుక సరఫరా అవుతూ ఉంటుందన్నారు. ఇటుక తయారీకి అవసరమయ్యే చెరువుల్లో లభించే నల్ల రేగడి మట్టిని ప్రతి ఏటా వేసవి కాలంలో రాజకీయ పార్టీల అండదండలతో తరలించుకు పోతున్నారు.

ఇటుక బట్టీల యజమానుల పేరిట గానీ, ఇతరుల పేరిట గాని అనుమతులు తీసుకుని కొంత మొత్తంలో రాయల్టీ, సీనరేజీ చెల్లించి పెద్ద ఎత్తున మట్టిని తరలించుకు పోతున్నారన్నారు. ఇటుక బట్టీల యజమానులు కొందరు తమకు అవసరమయ్యే మట్టిని తీసుకోవడంతో పాటు ఇతరులకు మట్టిని అమ్ముకుని లక్షలాధి రూపాయలు ఆర్జిస్తున్నారు.

గౌరెడ్డిపేటకు చెందిన ఎన్‌బీసీ ఇటుక బట్టీల యజమాని కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి చెరువులో మట్టి తరలింపునకు అనుమతులు తీసుకున్నారని, మొదట 6 వేలు, ఆ తర్వాత 2 వేల టన్నుల మట్టి తరలింపునకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించారు. కానీ రాత్రింభవళ్లు అనేక లారీల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండా 15 వేల టన్నులకు పైగా మట్టిని తరలించారన్నారు. అలాగే రామగుండం మండలం అల్లూరు చెరువు మట్టిని తరలించుకునేందుకు మియాపూర్‌కు చెందిన ఒకరు అనుమతులు తీసుకుని 2 నుంచి 4 వేల టన్నులకు రాయల్టీ చెల్లించి అడ్డగోలుగా మట్టిని తరలించారన్నారు.
ఈ రెండు చెరువుల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులకు పట్టించినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేవు. మంథని మండలంలోని బిట్టుపల్లి చెరువులో మట్టి తవ్వకాల కోసం అనుమతులు పొందగా, గ్రామస్తుల ఫిర్యాదుతో అనుమతులను రద్దు చేశారు. ఆ తర్వాత వారం రోజులకు మళ్లీ అనుమతులు ఇచ్చారు. 10 వేల టన్నుల మట్టి కోసం రాయల్టీ చెల్లించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.
ముర్మూరు చెరువుపై కన్నువేశారు,
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు అడుగంటడంతో ముంపునకు గురైన ముర్మూరు గ్రామంతో పాటు చెరువు తేలింది. దీంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. అనుకున్నదే తడవుగా 60 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి కోసం పెద్దపల్లి మండలంలోగల ఏఎస్‌ఆర్‌ బ్రిక్స్‌ యజమాని ఏ శ్రీనివాస్‌, ఎస్‌హెచ్‌ఆర్‌ బ్రిక్స్‌ యజమాని ఏ సౌందర్య పేరిట అనుమతులు పొందారు.

విడతల వారీగా ఏఎస్‌ఆర్‌ 14,500, ఎస్‌హెచ్‌ఆర్‌ 15,500 మెట్రిక్‌ టన్నుల మట్టికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించారు. ఈ చెరువులో పది భారీ ఎక్స్‌కవేటర్లు, ప్రొక్లెయిన్లు, 50కి పైగా లారీలను పెట్టి చెరువు నుంచి ఒక్కో లారీలో 30 నుంచి 40 టన్నులకు పైగా మట్టిని చెరువుకు సమీపంలోగల ప్రభుత్వ స్థలంలో డంప్‌ చేస్తున్నారు. ఆ మట్టి పరిమాణం తెలియకుండా ఉండేందుకు పది వరకు బ్లేడ్‌ ట్రాక్టర్లు పెట్టి నేర్పించి తొక్కిస్తున్నారు. ఎవరన్న అధికారులు వచ్చిన ఆ డంప్‌ను తనిఖీ చేసినా కూడా కొలతలకు దొరకుండా ఉండేందుకు మట్టిని నేర్పుతున్నారు.

మట్టి తవ్వకాలపై సంబంధిత నీటి పారుదల శాఖాధికారుల పర్యవేక్షణ కరువయ్యిందన్నారు. వాస్తవానికి నీటి పారుదల శాఖాధికారులు ఆయా చెరువుల్లో ఎంత లోతు పరిమాణంలో మట్టి తీసుకోవాలో పరిశీలించి అనుమతి ఇవ్వాలి. గనులు, భూగర్భ శాఖకు రాయల్టీ చెల్లించిన తర్వాత వే బిల్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలను పక్కన పెట్టి మొత్తం బాధ్యతను కేవలం నీటి పారుదల శాఖకు మాత్రమే అప్పగించారు. దీంతో సదరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఓవర్‌లోడ్‌తో వాహనాలు వెళుతున్నా కూడా రవాణా శాఖాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులకు ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నారు. ఆయా గ్రామాల ప్రజలు మట్టి లారీలను పట్టుకుని అధికారులకు అప్పగించినా కూడా కేసులు నమోదు చేయడం లేదు.

పెద్దపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో రాత్రివేళల్లో అక్రమంగా కొందరు ఇటుక బట్టీల యజమానులు తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై కలెక్టర్‌ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారన్నారు.
ముఖ్యంగా ఇటుకబట్టిల యాజమాన్యాల పై టాస్క్ ఫోర్స్ దాడులు చేసి వారిని కఠినంగా శిక్షించాలి.
ప్రకృతి సంపదను కొల్లకొడుతున్న వారి పై పిడి యాక్ట్ నమోదు చేయాలి అని మి ద్వారా కోరుతున్నామని తెలిపారు.