TRINETHRAM NEWS

సొంత నేతలపై కవిత మండిపాటు

నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కార్యకర్తలను అధిష్టాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కామెంట్ చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. నిజామాబాద్‌లో ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇవ్వాలన్నారు.