TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, BRS పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

‘తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప APకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రాకు నీళ్లు వదిలారు. రాష్ట్రంలోని 8 జిల్లాలు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో అడిగిన వెంటనే కేసీఆర్ నీళ్లు వదిలారు’ అని జగన్ చెప్పారు.