TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది.

అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది.

ఆయనకు బదులుగా 16-21 వరకు జరిగే అన్ని పూజల్లో ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా దంపతులు పాల్గొంటారని వివరించింది.

22న మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ గంతలు విప్పి, హారతి ఇస్తారని ట్రస్ట్ వెల్లడించింది.