TRINETHRAM NEWS

Trinethram News : రాజోలు, మార్చి 11 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. మొగలికుదురు మాజీ సర్పంచ్ చింతా లక్ష్మి జై భీం జెండా ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు తదుపరి జై భీం జెండా ను రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు, అంబేడ్కర్ విగ్రహాల పరిరక్షణ సమితి చైర్మన్ బొంతు మణిరాజు లు సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ చిలకపాటి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ మాట్లాడుతూ తాటిపాక సెంటర్లో జై భీం జెండా రెపరెపలాడటం చాలా ఆనందంగా ఉందన్నారు. జై భీం జెండా ఆవిష్కరణకు కృషిచేసిన తాటిపాక యువకులైన మందపాటి మధు, గోగి మోహన్, మెడబల శేఖర్, పొన్నమాటి భాస్కర్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు బత్తుల మురళీకృష్ణ తెలిపారు. అనంతరం అంబేడ్కర్ జిల్లా పోరాట సమితి వ్యవస్థాపకులు నల్లి శ్రీనివాస్, మామిడికుదురు మండల అంబేడ్కర్ యువజన సంఘ అధ్యక్షులు కలిగితి పల్లం రాజు, రిటైర్డ్ ఎంఈవో నీతిపూడి చంద్రరావు, మట్టా సురేష్, మట్టా వెంకటేష్, ఎస్సీ సంక్షేమ సంఘ నాయకులు బొడ్డపల్లి సతీష్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మొగలికుదురు మాజీ సర్పంచ్ చింతా లక్ష్మిని నాయకులు శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చుట్టుగుళ్ళ సత్యనారాయణ, తెన్నేటి నాగేశ్వరరావు, ఉల్లంపర్తి దర్శనం, పొన్నమండ ఎఫ్ఎల్సిఎస్ అధ్యక్షులు కుసుమ రాజుకుమార్, దళిత చైతన్య వేదిక నాయకులు దాకే స్వామిరెడ్డి, బొడ్డపల్లి పుల్లయ్య, కుసుమ పెరుమళ్ళ కుమార్, జిల్లెళ్ళ వినోద్, డాక్టర్ బాబు, బత్తుల రాజేష్, ఉండ్రు జాన్, యెల్లమెల్లి రామ్మోహన్, మాజీ ఎంపీటీసీ గెడ్డం సురేష్, ఒగూరి విక్కీ, గెడ్డం రవి, నాగబత్తుల లక్ష్మీనారాయణ మరియు గెద్దాడ యూత్ సభ్యులు పాల్గొన్నారు.