TRINETHRAM NEWS

Trinethram News : ఉమ్మడి నెల్లూరు జిల్లా :

ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5 కోట్ల 12 లక్షలు రూపాయల నగదు పట్టివేత

ఎన్నికల నేపథంలో గూడూరు వ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు

చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో మూడు బృందాలను పట్టుకున్న పోలీసులు

వారి వద్ద మొత్తం 5 కోట్ల 12 లక్షల 91 వేలు స్వాధీనం

విజయవాడ నుంచి చెన్నైకి నగదు తీసుకెళుతున్నట్లు వెల్లడించిన మూడు బృందాలు

మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్న గూడూరు పోలీసులు

సాయికృష్ణ, శ్రీధర్, రవి, లక్ష్మణరావు, అనీల్ కుమార్, సూర్యానారాయణ మూర్తి లు అరెస్ట్

నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించిన పోలీసులు

మీడియాకు వివరాలు వెల్లడించిన డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి