TRINETHRAM NEWS

Hotels and restaurants till midnight

Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 25
హైదరాబాద్ జిల్లాలోని రాచకొండ, సైబరాబాద్ పలు ప్రాంతాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్, పాన్ దుకాణాలు,పనివేళలను ఇక నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు నిర్వహించుకోవచ్చని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే సూపర్ మార్కెట్లు, బంగారు షాపులు, ఇతర కిరాణ దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించు కోవచ్చు. దీనికి సంబంధిం చి మంగళవారం ఉత్తర్వుల ను జారీ చేసింది ప్రభుత్వం.

వైన్స్ లిక్కర్ అవుట్ లెట్స్ జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే షాపులు సమయాన్ని కూడా పొడిగించారు. ఈ దుకాణాలను ఉదయం 10గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించు కోవచ్చని తెలిపింది.

జీహెచ్ఎంసీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దుకాణాల నిర్వహణ వేళలు కూడా పెంచింది. వారంతరంలో శనివారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చని వెల్లడించింది.

ఇక వీకెండ్ లో అయితే ఉదయం 10గంటల నుంచి అర్థరాత్రి 1 వరకు ఓపెన్ చేసుకోవచ్చు.అట….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hotels and restaurants till midnight