ఢిల్లీలో భారీగా విదేశీ గంజాయి సీజ్
Trinethram News : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.47 కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్న ఐదుగురుని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి గంజాయిని సీజ్ చేశారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లు గంజాయిని 94 ప్యాకెట్లలో ప్యాక్ చేసి 5 ట్రాలీ బ్యాగుల్లో నింపి తరలించారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App