TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా
పెనమలూరు నియోజకవర్గం

కంకిపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వెండి పట్టివేత

నిన్న రాత్రి కారులో అక్రమంగా తరలిస్తున్న 132 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న కంకిపాడు పోలీసులు.

సుమారు 92 లక్షల విలువ ఉంటుంది అని ఎలాంటి బిల్లులు లేవని తెలిపిన పోలీసులు.

నర్సాపురంకు చెందిన జక్కంపూడి హనుమంతు,షేక్ కాలీషా కారులో తరలిస్తుండగా పట్టివేత.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంకిపాడు పోలీసులు.