TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట టౌన్, జనవరి1

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరం లో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతోనీ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ నిత్యం ఆరోగ్యంగా ఉండాలని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు . సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.ఆనందంతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆశిస్తూ..,కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త ఆలోచనలతో మీరు తలపెట్టిన ప్రతిపనీ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ, 2024 ఆంగ్ల సంవత్సరాది మీ కుటుంబానికి అన్ని సుఖసంతోషాలూ అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.