TRINETHRAM NEWS

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు

Trinethram News : ఉత్తర ప్రదేశ్ :జనవరి 24
అయోధ్య రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్‌ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది.

ఆయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రామ్‌ లల్లా దర్శనానికి వానరం దక్షిణ ద్వారం గుండా గర్భగుడి లోకి ప్రవేశించింది.

విగ్రహం వరకు వెళ్లడంతో సిబ్బంది పట్టకునేందుకు చూడగా ఉత్తర ద్వారం వైపు వెళ్లిపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు..