TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల్లో బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 26వ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3వ తేదీలోపు రెగ్యులర్‌ విద్యార్ధులు రూ.2130 పరీక్ష రుసుము చెల్లించాలి. మార్చి 4వ తేదీన రూ.100 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు. ఈ మేరకు ఏసీఏ రెడ్డి ప్రకాశరావు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరోవైపు మే 1వ తేదీన కార్మిక దినోత్సవం ఉన్నందున్న ఆ రోజు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని పలు విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.