
Trinethram News : ప్రముఖ SAR గ్రూప్నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ2డబ్ల్యూని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ను సంస్థ రూ.49,999 ఎక్స్ షోరూం ధరకు విక్రయిస్తోంది. దీనిలో కొత్త అంశం ఏమిటంటే ఈ బైక్తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ స్కూటర్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి. మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 50 కి.మీ ఉంటుంది.
