TRINETHRAM NEWS

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

  • దుబ్బాక నియోజకవర్గం లో పలు రహదారుల నిర్మాణం కోసం వినతి.
  • రూ. 33 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి..

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారులకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం రాత్రి ఆర్ అండ్ బి (రోడ్డు భవనాల) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నవించారు.
-నియోజకవర్గంలోని మెట్టు -దౌల్తాబాద్ హైదరాబాద్ బ్రిడ్జి ,వయా తిమ్మాపూర్ పద్మనాభంపల్లి మీదుగా రోడ్డు నిర్మాణానికి సిఆర్ఎఫ్ నిధులు రూ. 25 కోట్లు విడుదల చేయాలని,

  • దీంతోపాటు మొండి చింత బేగంపేట్ వరకు ఉన్న సింగల్ రోడ్డు ను డబుల్ రోడ్డు గా విస్తరించేందుకు రూ .7 కోట్లు మంజూరు చేయాలన్నారు. -చేగుంట -బోనాల రోడ్డు నిర్మాణానికి రూ. 70 లక్షలు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విన్నవించారు.

ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని , నిధులు మంజూరుకు ఆయన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు.