TRINETHRAM NEWS

Trinethram News : గట్టు మండలం ( ఫిబ్రవరి 21): జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమం లో డాక్టర్ రాజు మాట్లాడుతూ 0 – 5 వయస్సుగల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఈ కార్యక్రమం ఇదివరకు అందరం కలిసి చేసి విజయవంతం చేశామని ఈ సంవత్సరం కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ సిహెచ్ ఓ హుస్సేన్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మరియు మక్సూద్ సూపర్వైజర్ స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు