TRINETHRAM NEWS

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

కాగా ఆదివారం స్వామివారిని 76,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,543 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.