TRINETHRAM NEWS

Trinethram News : Mar 19, 2024,

మోడీ రోడ్‌షోలో పిల్లలు.. కలెక్టర్ విచారణ
కోయంబత్తూరులో ప్రధాని మోదీ సోమవారం నిర్వహించిన రోడ్ షోలో 50 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ క్రాంతికుమార్ విచారణ చేపట్టారు. పిల్లలను ప్రచారానికి ఉపయోగించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించిందన్న ఫిర్యాదుపై కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖను వివరణ కోరామని, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.