TRINETHRAM NEWS

నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ కు, వినతి,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పట్టణంలోని వివిధ ఎస్సీ కులాల,పై జరుగుతున్న దాడులను కుల,దూషణల,ను నివారించేందుకు ఎస్సీ ఎస్టీ కులాల వారిని తిట్టి,దాడులు చేస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేయించి బాధితులకు అండగా నిలవాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి,రాంచందర్,ను కలిసి విజ్ఞప్తి చేశారు,,ఎన్ టి పి సి జ్యోతిభవన్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ,రాష్ట్ర నాయకత్వం లో వడ్డేపల్లి రామచందర్ కలిసి దళిత కులాల పై జరుగుతున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు, గోదావరిఖని పట్టణంలోని కానిస్టేబుల్ ఆర్నకొండ సదానందం ను సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ సాంబశివరావు కులం పేరుతో తిట్టి,,ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా గోడ అడ్డం పెట్టించిన వాటిపై ఫిర్యాదు చేశారు, కోరే శంకరును కులం పేరుతో తిట్టి, చెప్పులతో కొట్టిన విషయం కూడా,

కోరే శంకర్,నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే పల్లి రామచందర్,కు ఫిర్యాదు చేశారు, పెద్దపల్లి మండలం దొంగ తుర్తి, గ్రామానికి చెందిన చెందిన,భూ పల్లి ప్రసాద్ ను కూడా కులం పేరుతో దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భూపెల్లి ప్రసాద్ నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యుల,దృష్టికి తీసుకువచ్చారు, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్లక్ష్యం కాబడుతున్నాయని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు, జిల్లాకు సంబంధించిన అనేక దళితుల,సమస్యలను కూడా వడ్డేపల్లి రామ్ చందర్ దృష్టికి తీసుకువచ్చారు,

అనేక సమస్యలపై అధికారులతో మాట్లాడుతానని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ సానుకూలంగా స్పందించారు, ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, కురుమ పల్లి మాజీ సర్పంచ్, మామిడిపల్లి బాపయ్య, సీనియర్ జర్నలిస్టు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి, కొంకటి లక్ష్మణ్, సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు, యాట ఓదెలు, సీనియర్ నాయకులు పంగ,రాజయ్య, బాధితులు ఆర్నకొండ సదానందం, కోరే, శంకర్, భూపెల్లి,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

వడ్డేపల్లి రాంచందర్ కు,, యాట ఓదెల,కు సన్మానం నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్,ను, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూల బోకే అందించి శాలువతో, ఘనంగా సన్మానించారు, అదేవిధంగా సింగరేణి ఎస్ అండ్ పిసి జూనియర్ ఇన్స్పెక్టర్, గా పదోన్నతి పొందిన, సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు, యాట ఓదెలను, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు, వడ్డేపల్లి రామచందర్ శాలువా కప్పి సన్మానించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App