TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తారీఖున “మన్యం బంద్” కు పిలుపు – మొట్టడం రాజబాబు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : 1/70 చట్టం సవరణ చేయాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ఈనెల 12 న మన్యం బంద్ ప్రకటించింది. ఆదివాసీ జెఏసి.
1/70 భూబదాలయింపు నిషేధ చట్టం సవరణ చేయాలని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 12 న రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్ కు ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి పిలుపునిచ్చిందని, జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు తెలిపారు. జనవరి 27 వ తారీఖున విశాఖపట్నంలో ఆంధ్ర్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన, సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం సడలిస్తే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని, వివాదస్పదమైన వ్యాఖ్యలపై ఆదివాసీ సమాజం తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 12 తారీఖున ఆంధ్ర ప్రదేశ్ లో గల మన్యం బంద్ కు పిలుపునిచ్చింది.

భూబదాలాయింపు నిషేధచట్టం సవరిస్తే షెడ్యూల్ ప్రాంతం పూర్తిగా నాశనమౌతుందని,చట్టం ఉన్నప్పుడే అమలు చేయకపోవడంతో ఉల్లంఘన జరుగుతోందని,చట్టమే సవరిస్తే మన్యానికి అధోగతేనని, ఆదివాసీల పోరాటాలతో భూ బదలాయింపు నిషేధచట్టం 1917లో బ్రిటీషు ప్రభుత్వం హయాంలోనే వచ్చిందని,స్వాతంత్ర్యం అనంతరం 1959లో,1970లలో మరిన్ని సవరణలు చేసి చట్టం కఠిన తరం చేసారు. కానీ అమలు చేయడంలో విఫలమయ్యారని, 5 వ షెడ్యూల్ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడుకి లేదని,తన పరిధి మించి మాట్లాడమే కాకుండా 1/70చట్టం గురించి అవగాహన లేదని, అయ్యన్న పాత్రుడు అనడం శాసనసభాపతి పదవికి అనర్హడని,అయ్యన్న పాత్రుడు శాసనసభాపతిగా కాకుండా నాటకాల్లో హశ్యగాడిలాగా వ్యవహారించడం వల్ల తెలుగు ప్రజలు సిగ్గు పడుతున్నారని, మొట్టడం రాజబాబు మీడియా ముందు తీవ్రంగా విమర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Manyam Bandh