TRINETHRAM NEWS

Trinethram News : టోఫెల్ స్కాలర్ షిప్ 2.5లక్షలు

హైదరాబాద్‌ :

ఇంగ్లండ్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ సంస్థ టోఫెల్‌ స్కాలర్‌షిప్‌ ప్రకటించింది.

ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్‌కు వెళ్లే వారికి రూ.2.5 లక్షల స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నది. జాతీయస్థాయిలో ఎంపికచేసిన 10 మందికి ఈ స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌ కోసం ఈ ఏడాది జూలై 15 వరకు భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నేషనల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అండ్‌ అలుమ్ని యూనియన్‌ (ఎన్‌ఐఎస్‌ఏయూ) సహకారంతో టోఫెల్‌ ఈ స్కాలర్‌షిప్‌ను అందజేయనున్నది. 2025 విద్యా సంవత్సరంలో ఫుల్‌టైమ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేసే విద్యార్థులకు దీనిని అందజేస్తారు. అయితే టోఫెల్‌ టెస్టు స్కోర్‌ 120కి 75 మార్కులు ఉండాలి. దరఖాస్తులు సహా పూర్తి వివరాల కోసం toefltest.in/scholarship వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.