TRINETHRAM NEWS

రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం

విజయవాడ స్వరాజ్య మైదానంలో 125అడుగుల ఎత్తున నిర్మించిన అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని CMజగన్‌ శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు.

సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. మొత్తంగా రూ.404 కోట్ల వ్యయంతో 18.81ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్‌ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు.

విగ్రహ పీఠం కింది భాగంలో అంబేద్కర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది