TRINETHRAM NEWS

మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య?

మెదక్ జిల్లా జనవరి 20
మెదక్ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.

రామాయంపేట మండలం కోనాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మృతుడు జోగిపేటకు చెందిన చాకలి మల్లేశంగా గుర్తించారు.

గుర్తు తెలియని వ్యక్తులు చాకలి మల్లేశంను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.