TRINETHRAM NEWS

నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500!

మరో హామీ అమలుపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అమలుచేయడంపై ఆర్థికశాఖతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్లు సమాచారం.

ఇప్పటికే ఫ్రీ బస్, రూ.10 లక్షలతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసిన విషయం తెలిసిందే.