TRINETHRAM NEWS

131st birth anniversary of Korivi Krishnaswamy Mudiraj, the first Mayor of Hyderabad and pioneer of reforms

Trinethram News : ఆగస్టు 26. —-
మిర్యాలగూడ అమరవీరుల స్థూపం వద్ద, సోమవారం బీసీ జేఏసీ మరియు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 131వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, బిజెపి నాయకులు బంటు సైదులు, బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, బీసీ జేఏసీ కో- కన్వీనర్ దాసరాజు జయరాజు మాట్లాడుతూ, కృష్ణస్వామి ముదిరాజ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాద్ నగర మొదటి మేయర్, రచయిత, జర్నలిస్టు, ఆర్కిటెక్ట్ మరియు బహుజన సంఘాల నిర్మాత అని కొనియాడారు.

శంకర్ నాయక్ పేర్కొన్న దాని ప్రకారం, కృష్ణస్వామి ముదిరాజ్ తన జీవితాంతం ముదిరాజ్ జాతితో పాటు బహుజనుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఆయన, నగరానికి ఏనాడో నక్షాన్ని అందించి, తన కుటుంబం గురించి ఆలోచించకుండా, బహుజన సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.

కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని శంకర్ నాయక్ మరియు ఇతర నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు కృష్ణస్వామి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పార్టీ నేతలు, కార్య కర్తల సమక్షంలో కార్యక్రమం నిర్వహణ

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ కోల సైదులు ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రతి ఊరులోని ముదిరాజ్ సోదరులు కృష్ణస్వామి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి జాతి ఐక్యతకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

131st birth anniversary of Korivi Krishnaswamy Mudiraj, the first Mayor of Hyderabad and pioneer of reforms