TRINETHRAM NEWS

జైలు నుంచి విడుదలైన సత్యేంద్ర జైన్ …

Trinethram News : మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సీఎం అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు జైలు బయట సత్యేంద్ర జైన్‌కు సాదర స్వాగతం పలికారు. బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయంపై సత్యేంద్ర జైన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది సత్యానికి దక్కిన విజయమని అభివర్ణిస్తూ ‘సత్యమేవ జయతే’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App