TRINETHRAM NEWS

Trinethram News : ఆర్‌బిఐ ప్రకారం, చలామణి నుండి ఉపసంహరించబడిన రూ.2,000 నోట్లలో 97.92 శాతం తిరిగి వచ్చాయి. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023లో రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.దేశంలోని ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రజలు మిగిలిన నోట్లను మార్చుకోవచ్చు.
ఈ కేంద్రాలకు పోస్ట్ ద్వారా కూడా నోట్లను పంపవచ్చని ఆర్బీఐ తెలిపింది.