TRINETHRAM NEWS

మంగళగిరి: వైకాపా(YSRCP)ను వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును తెదేపాలోకి ఆహ్వానించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పారు..