TRINETHRAM NEWS

Grand Utlotsavam in Tiruchanur

Trinethram News : తిరుపతి, 2024 ఆగస్టు 28

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది.

ఇందులోభాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీక ష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Utlotsavam in Tiruchanur