TRINETHRAM NEWS

ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి

*చిన్న కల్వల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

సుల్తానాబాద్, అక్టోబర్ -21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష
సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష
మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్ల , దొడ్డు వడ్లకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. సుల్తానాబాద్ ప్రాంతంలో వరి కోతలు ముందుగా జరిగే నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభించి సన్నద్దంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్ని బ్యాగులు ,ప్యాడ్ క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని , టెంట్, త్రాగు నీరు, కుర్చీలు మొదలగు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. వర్షాల దృష్ట్యా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని అన్నారు.

సన్న రకం దాన్యం నాణ్యత వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరిస్తారని అన్నారు. ఏ.ఈ.ఓ టోకెన్ నెంబర్, ధాన్యం రకం వివరాలు, ధాన్యం పరిమాణం, నాణ్యత మొదలగు అంశాల సర్టిఫికెట్ పరిశీలించి కాంట పెట్టాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర , రైతులు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు మొదల వివరాలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

కోనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన హామాలీలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వివరాలను ఆన్ లైన్ లో ఎంటర్ చేసి ట్రాక్ షీట్ జనరేట్ చేయాలని, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు అవసరం మేర పెట్టుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీ మాల,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App