TRINETHRAM NEWS

Ayodhya handloom cloths for Ram

Trinethram News : దుబ్బాక, సెప్టెంబర్‌ 17 : అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్రాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ వారు తయారు చేసిన చేనేత వస్ర్తాల్లో సోమవారం బాల రాముడు మెరిసిపోయారు.

చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు. అయోధ్య బాలరాముడి విగ్రహానికి దుబ్బాక చేనేత వస్ర్తాలు మరోసారి అలంకరించడంపై స్థానిక నేతన్నలు సంతోషం వ్యక్తంచేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ayodhya handloom cloths for Ram