TRINETHRAM NEWS

ఏరియా-1 జీడీకే 11 ఇంక్లైన్ లో దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న

రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జీడికే 11 ఇంక్లైన్ లో దేవి నవరాత్రులు ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది అనంతరం అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా కార్మికులకు వడ్డించడం జరిగింది.
సింగరేణి కార్మిక వర్గంకి కాంగ్రెస్ ప్రభుత్వం లో 33% లాభాల వాటా ప్రకటించి కాంటాక్ట్ కార్మికులకు చరిత్రలో లేనివిధంగా 5000 రూపాయలు ఇచ్చింది అని చెప్పడం జరిగింది
11 ఇంక్లైన్ కార్మికులకు ప్రధాన సమస్య డ్యూటీకి వెళ్ళే రోడ్డు మార్గమును శాశ్వతంగా రోడ్డు ఏర్పాటు చేసి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది..
సింగరేణి కార్మికుల ఆశీర్వాదంతోనే భారీ మెజార్టీతో నేను విజయం సాధించనని మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పడము జరిగిందీ…
సింగరేణి సంస్థ పురోగతి ఉజ్వల భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది
అమ్మవారి ఆశీస్సులతో రామగుండం ప్రజానీకం సింగరేణి కార్మిక కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది
సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులకు అందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలుపడం జరిగింది..
ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగరేణి అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App