TRINETHRAM NEWS

Trinethram News : రేవంత్ పాలనపై ఏపీలో ప్రశంసలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ఏపీలో ప్రశంసలు వస్తున్నాయి.

తెలంగాణలో రేవంత్‌‌రెడ్డి పరిపాలన బాగుందని.. ఇందుకు ఆయనను అభినందిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు.

రేవంత్‌‌రెడ్డిని ఏపీ ఇంఛార్జీని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.

ఏపీని వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు.