TRINETHRAM NEWS

Trinethram News : Mar 19, 2024,

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం
దంపతులు అధిక వడ్డీల ఆశజూపి రూ.కోట్లలో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ‘జేవీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు ఓ సంస్థను నడిపిస్తున్నారు. అధిక వడ్డీలు, రకరకాల ఆకర్షణీయమైన స్కీములతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.2.50 కోట్లు మోసపోయినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.