Trinethram News : ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండి బీచ్లో డిసెంబర్ 14న జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. యూదుల హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) కాల్పులు జరిపారు. సాజిద్ ఘటనా స్థలంలోనే పోలీసుల కాల్పుల్లో మరణించగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సాజిద్ అక్రమ్ హైదరాబాద్కు చెందినవాడు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత యూరోపియన్ సంతతికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించిన పౌరుడు. సాజిద్ వద్ద హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్పోర్ట్ ఉన్నట్టు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ అధికారులు గుర్తించారు.
దాడికి ముందు నవంబర్లో తండ్రీకొడుకులు ఫిలిప్పీన్స్కు వెళ్లి వచ్చారు. అక్కడ ISIS-సంబంధిత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి. వారి వాహనంలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్లు, హోమ్మేడ్ ISIS జెండాలు లభ్యమయ్యాయి. దాడి ISIS భావజాలం ప్రేరేపితమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


