TRINETHRAM NEWS

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం.

హైదరాబాద్ జనవరి 24:నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది.

రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు.

అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా తీయ నుంది. భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను కమిటీ ధరణి కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు.