Mallikarjuna Kharge : తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం

TRINETHRAM NEWS

Trinethram News : బాంబు పేల్చిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేసిండు

తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్న ఖర్గే

సంచలన విషయాలు బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ రిపోర్టర్ వాసు

రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడు

పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారు

మంత్రుల మధ్య కీచులాటలు, వాటాల పంపకాల లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చింది.. బిసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యింది.. మొదటి నుండి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదు. ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదు.. ఇప్పుడు బిసి రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది అనే సంకేతాలు వెళ్తున్నాయి. అది పార్టీకి తీవ్ర నష్టం చేసింది.. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న రెడ్లు, దళితులు ఈ అంశం వల్ల మనకు దూరం అయ్యారు.

పోనీ బిసిలు అయినా మనకు దగ్గర అయ్యారా అంటే అదీ లేదు. రేవంత్ చేసిన నిర్వాకం వల్ల అన్ని కులాల వాళ్లూ కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారు.. అనవసరంగా రేవంత్ ఇందులోకి రాహుల్ గాంధీ పేరును లాగాడు. ఇది రాహుల్ ఇమేజ్‌ను కూడా డ్యామేజ్ చేసింది – మల్లికార్జున ఖర్గే

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress unlikely to return to power in Telangana

You cannot copy content of this page

Scroll to Top