బిఆర్ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు.
డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 15 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని టి గౌరారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త నల్ల రాములు భార్య నల్ల రాములమ్మ మృతి బాధాకరమని డిండి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు అన్నారు. ఈరోజు ఆమె మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నల్ల పెద్దయ్య, బయ్యా వెంకటయ్య, గిరమోని శ్రీనివాస్, వెంగల్ రావు, ఎం డి రషీద్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


