Yashoda Hospital :అత్యంత అరుదైన జబ్బు కి చికిత్స చేసి ప్రాణం కాపాడిన మలక్ పేట యశోద హాస్పిటల్ వైద్యులు

TRINETHRAM NEWS

Trinethram News : ప్రపంచ స్థాయి చికిత్సతో రోగి ప్రాణాలను కాపాడిన మలక్ పేట యశోదా హాస్పిటల్స్ వైద్య బృందం.. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో రక్తనాళాలకు సంబంధించిన అనారోగ్యంపై చాలా తక్కువ అవగాహన ఉంది. వంటి అరుదైన రక్తనాళ సమస్యలు అనూహ్యమైన రీతిలో అప్పటికప్పుడు ప్రమాదకరంగా పరిణమించి రోగి ప్రాణాలను హరిస్తాయి. ఈ రకమైన సమస్యలు ఎక్కువగా వ్యాధులతో బాధపడే రోగులలో అధికంగా కనిపిస్తాయి. తో బాధపడే వ్యక్తుల్లో రక్తనాళాలు బాగా బలహీనమవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి.రక్తనాళాల వ్యాధులతో బాధపడే రోగులకు అత్యవసర పరిస్థితులు ఎప్పుడూ ప్రాణాంతకమైనవే. శరీరంలో నిశ్శబ్దంగా ఇవి పెరుగుతూ ఉన్నపళంగా ఒక్కసారిగా రక్తనాళాలు పగిలడంవల్ల తీవ్రమైన నొప్పి కలిగి, అంతర్గత రక్తస్రావం వల్ల రోగి ప్రాణాలు పోయే ప్రమాదం హెచ్చుగా ఉంటుంది. తెలంగాణ జిల్లాల్లో అరుదైన ధమనుల వ్యాధుల పట్ల సరైన అవగాహన లేకపోవడం ఆంద ఉన్నవారిలో, ఈ సమస్య మరింత ఉధృతంగా కన్పిస్తుంది – అత్యవసర పరిస్థితుల్లో వీలైనంత త్వరగా సకాలంలో సరైన వైద్య చికిత్సను అందించకపోతే రోగి ప్రాణాలకు తీవ్ర స్థాయిలో ప్రమాదం ఏర్పడుతుంది.
నల్గొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళా రోగి విజయ గాథ యశోదా హాస్పిటల్, మలక్‌పేట్, హైదరాబాద్ కు చెందిన నిపుణులైన రక్త నాళాల సమస్యల వైద్యబృందం అత్యంత క్లిష్టతరమైన ఓ కేసులో అనూహ్యమైన విజయాన్ని సాధించి ఓ నూతన అధ్యాయానికి తెర తీసింది. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన శ్రీమతి గౌరు అరుణ, 57 సంవత్సరాల మహిళ కుడి భుజంలో తీవ్రమైన నొప్పితో, వాపుతో యశోదా మలక్ పేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యవసర వైద్య చికిత్సా విభాగానికి వచ్చారు. 23 గంటల వ్యవధిలోనే నిపుణులైన యశోదా హాస్పిటల్ మలక్ పేట వైద్య బృందం స్కానింగ్ చేసి ఆణెకు కుడి సబ్ క్లావియెన్ ఆర్టరీకి ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే సరైన చికిత్స అందించకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం.వేగంగా స్పందించిన డా. రంజిత్ కుమార్ ఆనందసు, వాస్క్యులర్ మరియు ఎండోవాస్క్యులర్ సర్జన్ నేతృత్వంలోని వైద్య బృందం ఫెమోరల్ ఆర్టరీ ద్వారా మత్తుతో తో శస్త్ర చికిత్స జరిపి స్టెంట్ వేశారు. రక్తనాళంలో దెబ్బతిని ని సమర్థంగా మూసివేసి సరిదిద్దారు. దీనివల్ల రోగికి సాధారణ రక్త ప్రసరణ తిరిగి మొదలయ్యింది.

ఈ రోగికి ఉన్న రుమటాయిడ్ , కీళ్ల సమస్యలు సమస్య కూడా ప్రమాదకరంగా పరిణమించే ప్రమాదం ఉన్నందున, జనరల్ ఫిజీషియెన్ డా. రంగ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దానికి కూడా చికిత్స మొదలుపెట్టారు. అత్యాధునిక వైద్య నిపుణులైన రుమటాలజీ కార్డియాలజీ వైద్య బృందాల సమన్వయంలో అతి తక్కువ కాలంలోనే రోగి పరిస్థితి చక్కబడింది.అనేక వైద్య శాఖల నిపుణుల సహకారంతో పోషకాహార చికిత్సలు, శరీర ద్రవ సంతులనం తదితర విభాగాలకు చెందిన సమర్ధులైన వైద్య బృందాల సమర్ధమైన చికిత్స ద్వారా అత్యవసర పరిస్థితిలో హైదరాబాద్ మలక్ పేట యశోదా ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగానికి వచ్చిన 72 గంటల వ్యవధిలోనే రోగిపూర్తిగా కోలుకుని, ఆరోగ్యాన్ని పుంజుకుని ఆసుపత్రినుండి డిశ్చార్జ్ అయ్యింది.
యశోదా హాస్పిటల్ – మలక్‌పేట, హైదరాబాద్
రక్తనాళాలకు సంబంధించిన అత్యవసర, అధునాతన వైద్య సేవల మార్గదర్శి
ఈ విజయం మలక్ పేట యశోదా ఆసుపత్రి వైద్య బృందాల అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలకు, ఆసుపత్రిలో అందించే అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో కూడిన సేవలకు ఓ తార్కాణం. ప్రతి దశలోనూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మలక్ పేట యశోదా ఆసుపత్రి వైద్య బృందాల అంకిత భావం, సేవా భావం, నిబద్ధత, వృత్తి నైపుణ్యాలు అత్యవసర వైద్య సేవల విభాగానికి వచ్చిన ప్రతి కేసులోనూ ప్రస్ఫుటంగా తేటతెల్లమవుతున్నాయి.
తెలంగాణ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన రోగులకు సైతం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అధునాతమైన, సమర్థవంతమైన వైద్య సేవల్ని అందించడంలో హైదరాబాద్ మలక్ పేట యశోదా ఆసుపత్రి అంకిత భావం, నైపుణ్యం విస్పష్టంగా కనిపిస్తున్నాయనీ, మలక్ పేట యశోదా ఆసుపత్రి నిబద్ధతకు ఇవి చిహ్నాలనీ యశోదా హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కే. శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ చిదుర తెలిపారు.మలక్‌పేట్ యశోదా హాస్పిటల్‌లో దేశంలోకెల్లా అత్యున్నతమైన ప్రమాణాలతోకూడిన ఆధునిక వైద్య సాంకేతికతతో, అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నిపుణుల బృందం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని యశోదా హాస్పిటల్ మలక్‌పేట్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని యశోదా హాస్పిటల్‌కి చెందిన అన్ని శాఖల్లో ఆధునిక వైద్య సదుపాయాలు, సేవలు అందుబాటులో ఉన్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Doctors of Malakpet Yashoda Hospital

You cannot copy content of this page

Scroll to Top